Srisailam Free Sparsha Darshan For Chenchus: శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చెంచు గిరిజనులకు ప్రతి నెల చివరి బుధవారం ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తోంది. జనవరిలో మేకలబండ, హఠకేశ్వరం, సున్నిపెంట, పల్నాడు, మాచర్ల, దుర్గి మండలాలకు చెందిన 232 మంది చెంచులకు ఈ అవకాశం లభించింది. రూ.500, రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ కూడా కొనసాగుతోంది.. డిసెంబర్ నుంచి ఈ పంపిణీ ప్రారంభమైంది.