ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమించిన వాళ్లనే విచక్షణా రహితంగా చంపేస్తున్నారు. అనంతరం తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. షాపింగ్కు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన అమ్మాయిని.. ఆమె ప్రియుడు కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన నేపథ్యంలో యువతలో రోజురోజుకు పెరుగుతున్న హింసా ప్రవృత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.