రాచకొండ షీ టీమ్స్ మహిళల భద్రత కోసం డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. కేవలం 15 రోజుల్లో 127 మంది ఈవ్ టీజర్లను పట్టుకున్నారు. ఇందులో 80 మంది మేజర్లు, 47 మంది మైనర్లు ఉన్నారు. బస్టాండ్లు, విద్యా సంస్థలు వంటి ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా పెట్టి.. సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. 7 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.