సంకురాత్రి ఊసులు.. శివరాత్రి బాసలు.. మర్చిపోతివా మావా.. ఇల్లాలు కఠిన నిర్ణయం..

1 year ago 16
సత్యసాయి జిల్లా హిందూపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ భార్య బలవంతంగా తనువు చాలించింది. హిందూపురం మండలం కొడిపి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పొలం నుంచి తిరిగి వచ్చిన భర్త కళ్లముందే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోవడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Entire Article