Khammam Fake Plot Lottery Scam: ఖమ్మంలో రూ.500కే రూ.30 లక్షల విలువైన ప్లాటు అంటూ నకిలీ లక్కీ డ్రా స్కీమ్ నడిపిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ కుమార్ అనే వ్యక్తి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ లక్కీ డ్రా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అతడు తన స్థలాన్ని తాకట్టు పెట్టి, భారీ లాభాల కోసం ఈ మోసానికి పాల్పడ్డాడు. ఈ స్కీమ్లో 13 మందిని ప్రచారానికి నియమించుకున్నాడు. వీరి గురించి తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.