దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యనించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో రూ.110 కోట్లతో పది అంతస్తుల అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు భోజన రుసుములను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచుతూ ప్రతి నెలా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.