సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో ఒక ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ చేరియాల్ వద్ద జరిగిన కారు-లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.