సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్కు చెందిన ఆయన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సందీప్ సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.