నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తన స్వార్థం కోసం కన్న బిడ్డ జీవితాన్నే నాశనం చేయాలనుకున్న మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అసలేం జరిగిందంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి సొంత కూతురిపైనే అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఆ బాలికను బెదిరించి వీడియోలు కూడా తీశారు. దీనిపై పోక్సో కేసు నమోదు కాగా.. తాజాగా న్యాయస్థానం నిందితురాలైన తల్లికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు శివకుమార్ పరారీలో ఉండగా, అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.