తెలంగాణ ప్రభుత్వం గ్రామ రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచులకు ఇప్పటివరకు ఉన్న 'జాయింట్ చెక్ పవర్'ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిధుల విడుదల కోసం సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సంతకం కూడా కీలకంగా ఉండేది. అయితే.. విభిన్న పార్టీల మధ్య రాజకీయ విభేదాల వల్ల గ్రామాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచులు తమ అధికారం కోసం ఆశపడగా.. ఈ నిర్ణయం వారికి తీరని నిరాశను మిగిల్చింది.