ఆదివారం వచ్చిందంటే ముక్క కావాల్సిందే. మొన్నటి దాకా ఆ ముక్క తినాలంటే భారీ రేట్లు ఉన్నాయి. ఇక శ్రావణం మొదలవ్వడంతో ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. శ్రావణ మాసానికి ముందు రూ. 300 వరకూ వెళ్లిన కిలో చికెన్ ధర ఇప్పుడు రూ. 250లోపే దొరుకుతుంది. శ్రావణ మాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రులు ఇలా అన్నీ వరుసగా ఉండటంతో చికెన్ ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.