హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్యామ్ రాజ్ అనే వ్యక్తి మృతి చెందారు. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు అతివేగంగా దూసుకొచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారు బ్రిడ్జిపై ఆగి ఉన్న శ్యామ్ రాజ్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో మెడికవర్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. నిందితుడైన డ్రైవర్ పరారిలో ఉండగా.. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.