ఏపీలో సచివాలయ ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల వద్ద డబ్బులు సేకరించి.. వాటితో పరారయ్యాడు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తానని నమ్మించి.. పలువురు రైతుల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. అనంతరం కనిపించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన రైతులు.. న్యాయం చేయాలంటూ ఎంపీ అవినాష్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో సచివాలయ ఉద్యోగి చేసిన పనిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.