యూపీఎస్సీ సివిల్స్-2024 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50 మందికి పైగా విజయం సాధించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన ఏడుగురు అభ్యర్థులు కూడా ఈ ఫలితాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ సహకారంతో వీరు తమ లక్ష్యాలను చేరుకున్నారు.