పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుని 12 సంవత్సరాల రేవతి అనే బాలిక చనిపోయింది. స్నేహితుల ఇంటిలో ఆడుకునేందుకు వెళ్లగా.. అక్కడే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనతో రేవతి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.