సనత్నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి అత్యవసర విభాగంలో పునర్నిర్మాణ పనులు చేస్తుండగా సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. భవనం సెంట్రింగ్ ఒక్కసారిగా కూలి.. శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రి ఉన్నతాధికారులు, సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శ్లాబ్ పెచ్చులను తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన మృతుల కుటుంబీకులు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు.