భారతదేశం ప్రవచించిన సనాతన ధర్మం ఎంతో గొప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సంతోషం బయట ఎక్కడో ఉందని మనం వెతుకుతున్నామని.. కానీ మన ఋషులు ఆనందం మనలోనే ఉందని వందల సంవత్సరాల కిందటే చెప్పారన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన లోక్ మంథన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ధర్మమార్గంలో నడిస్తే ఆనందం లభిస్తుందని మన పూర్వీకులు ఆచరణాత్మకంగా చూపారని తెలిపారు. భారతీయులు అజాత శత్రువులని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారన్నారు.