తెలంగాణలో సన్నవడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున ప్రకటించిన బోనస్ చెల్లింపులో ఆరు నెలల ఆలస్యం జరుగుతోంది. చాలా మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము ఇంకా జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం.. సన్న వడ్లకు వ్యవసాయ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోవడమే అని తెలుస్తోంది. వరి గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి వంటి కొలతలు సరిగా లేకపోతే బోనస్కు అర్హత లభించడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.