సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల.. అకౌంట్లో జమ కాని వారు ఇలా చేయండి..

6 months ago 16
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లు కొన్న రైతులకు రూ. 314 కోట్ల బోనస్ చెల్లించినప్పటికీ.. చాలా మంది ఖాతాల్లో ఇంకా డబ్బు జమ కాలేదు. ఇలా డబ్బులు జమ కాని రైతులు ఆందోళన చెందకుండా, గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ (Grievance Registration) పద్ధతిని అనుసరించాలి. రైతులు https://civilsupplies.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఫార్మర్ కార్నర్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967కి కాల్ చేయవచ్చు. ధాన్యం అమ్మిన రసీదు, బ్యాంక్ వివరాలు, ఆధార్ లింక్ వివరాలతో ఫిర్యాదు చేస్తే, 3 నుంచి 7 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు తెలిపారు.
Read Entire Article