Fake Items Look Like As Branded In Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ వస్తువుల గుట్టు రట్టయింది. బ్రాండెడ్ లోగోలతో నకిలీ షాంపూలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్న హోల్సేల్ వ్యాపారుల బాగోతం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఈ నకిలీ వస్తువులు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నమ్మకమైన షాపుల్లోనే వస్తువులు కొనాలని అధికారులు సూచిస్తున్నారు.