ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక సంస్థల మీద భారం తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.