తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది భారీగా విద్యార్థులు తరలివస్తున్నారు. దాదాపు రెండున్నర లక్షల కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి, ఇందులో 50 వేల మంది ప్రైవేటు పాఠశాలల నుండి వచ్చినవారే. ప్రభుత్వం చేపట్టిన 'బడిబాట' కార్యక్రమం, మెరుగైన పదో తరగతి ఫలితాలు ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కూడా ఈ పెరుగుదలకు దోహదపడ్డారు. జూలై, ఆగస్టు నెలల్లో మరిన్ని అడ్మిషన్లు వస్తాయని భావిస్తున్నారు. ఆ వివరాలు..