సర్కార్‍‌ను పడగొట్టే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది.. మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

2 months ago 14
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేసిన తలసాని.. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి.. వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిందని గుర్తు చేశారు.
Read Entire Article