మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేసిన తలసాని.. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి.. వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిందని గుర్తు చేశారు.