తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుక ఇవ్వాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను కానుకగా ఇవ్వనుంది. గతంలో బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పేరుతో వీటిని అందిస్తోంది. త్వరలోనే వీటి పంపిణీని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..