తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చలు జోరందుకున్నాయి. హైకోర్టు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలా లేక బీసీ రిజర్వేషన్లు అమలయ్యాక వెళ్లాలా అనే దానిపై అధికార కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 23న జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.