సర్పంచ్, MPTC ఎన్నికలపై అప్డేట్.. ఎస్ఈసీకి కీలక ప్రతిపాదన

7 months ago 9
ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. బ్యాలెట్ బాక్సుల లభ్యత, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ప్రణాళికపై దృష్టి సారించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా తయారీని వేగవంతం చేసింది. ఆరు నెలల్లో మరణించిన వారి పేర్లు తొలగించి, కొత్త ఓటర్లను నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా జాబితాను రూపొందిస్తున్నారు. కొత్త ఓటర్ల చేరికతో మొత్తం సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article