తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి ప్రణాళికలు, బ్యాలెట్ పెట్టెలు, సిబ్బంది వివరాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సూచనలు ఇచ్చింది. కొత్త పంచాయతీలకు ఓటర్ల జాబితా తయారీ ప్రారంభమైంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.