తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులకు అనుమతిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ జారీపై నిర్ణయం తీసుకోనుంది.