తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికల నగరా మోగనుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.