సర్పంచ్ ఎన్నికల వేళ.. ఓ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్పై క్షుద్రపూజలు చేశారు. ఇక దాన్ని రాత్రిపూట ఏకంగా గ్రామ పంచాయతీ ముందు పెట్టి వెళ్లిపోయారు. ఉదయం గ్రామస్థులు అది చూసి.. షాక్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు ఇలాంటి ఘటన బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.