గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అయితే రిజర్వేషన్లపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఈ సెల్ పనిచేయనుంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది.