సర్పంచ్ ఎన్నికలో పోటీగా మాజీ మహిళా నక్సలైట్.. నామినేషన్ దాఖలు..

3 months ago 15
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవ పోరాటంలో చేరి, దాదాపు రెండు దశాబ్దాలు మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా పనిచేసిన నేరళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క, ఇప్పుడు ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. 2023లో పోలీసులకు లొంగిపోయి, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆమె, తన స్వగ్రామం శివంగాలపల్లి (కోనరావుపేట మండలం) సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని ప్రకటించిన జ్యోతక్క, శుక్రవారం సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
Read Entire Article