ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణలో కొందరు కొత్త సర్పంచ్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. హనుమకొండ జిల్లా రంగయ్యపల్లిలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి 30 లక్షల రూపాయల విలువైన ఎకరం భూమిని.. మరో 10 లక్షల నగదును దాత తిరుపతిరెడ్డి విరాళంగా ఇచ్చారు. రజినిని సర్పంచ్గా గెలిపిస్తే ఈ సాయం చేస్తానన్న మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అదేవిధంగా.. కరీంనగర్ జిల్లాలో మరో సర్పంచ్ తన హామీ మేరకు సూర్యాపేట నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించి గ్రామంలో కోతుల బెడదను వదిలించిన విషయం తెలిసిందే. ఓట్ల కోసం కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఇలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.