తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 ఆధారంగా రూపొందించిన కరదీపికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కరదీపిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతలను వివరిస్తూ.. గ్రామ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తోంది. నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై ఇది స్పష్టతనిస్తుంది.