తెలంగాణలో తెల్లకాగితాలపై జరిగిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. 2014కు ముందు జరిగిన ఒప్పందాలకు అధికారిక గుర్తింపు లభించనుంది. అయితే పూర్తి ఆధారాలు లేకపోవడం, విక్రేతల అభ్యంతరాలు, ధరల డిమాండ్ వంటి సవాళ్లను రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు.