కరీంనగర్ జిల్లా నాగులమల్యాల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మల్యాల జాహ్నవి పోటీ చేస్తున్నారు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. గ్రామంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్ల సమస్యల పరిష్కారానికి ఆమె ముందుకు వచ్చారు. యువత గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.