కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సాయన్న సతీమణి గీత ఇవాళ కన్నుమూశారు. ఇప్పటికే 2 ఏళ్ల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయిన సాయన్న కుటుంబం.. ఇప్పుడు మరొకరిని కోల్పోయింది. మొదట సాయన్న, ఆ తర్వాత ఆయన కుమార్తె చనిపోగా.. ఇప్పుడు సాయన్న భార్య చనిపోయారు. దీంతో సాయన్న కుటుంబంతోపాటు.. బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.