చెత్త సేకరణ, విద్యుదుత్పత్తి విషయంలో సింగపూర్ మోడల్ ఫాలో అవుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పుష్కరాలతో సంబంధం ఉన్న 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్ షాపులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ మారాలని.. డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.