తెలంగాణలో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మక ముందడుగు వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకారంతో.. రాజస్థాన్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి సంస్థ చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్కతో పాటు ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్. బలరాం, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ వెళ్లారు.