కరీంనగర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని సీబీఐ, ఈడీ పేర్లతో బెదిరించి డబ్బు గుంజాలని సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరును కూడా వాడుకుని నకిలీ లేఖలు సృష్టించారు. వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.