కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఆమె ఆలపించిన స్ఫూర్తిదాయక గీతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపే ఈ పాట.. వారిని ప్రోత్సహించేలా ఉంది. కలెక్టర్ గతంలోనూ సామాజిక అంశాలపై పాటలు పాడి ప్రశంసలు అందుకున్నారు.