సింహాచలం అప్పన్న ఆలయానికి తీపికబురు.. ఏకంగా రూ.70 కోట్లు

1 year ago 18
సింహాచలం అప్పన్న ఆలయానికి మరో భారీ విజయం దక్కింది. దేవాలయానికి చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిపై హైకోర్టులో కేసులు నడుస్తుండగా.. సెప్టెంబర్‌ నెలలో దేవస్థానం వాదనలతో ఏకీభవిస్తూ కేసులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆక్రమణలకు గురైన భూములను సింహాచలం దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఆ ప్రాంతాల్లో దేవస్థానం బోర్డులు ఏర్పాటు చేస్తోంది. తాజాగా విశాఖపట్నం సీతమ్మధారలోని పదెకరాలు, మరోచోట 4460 చదరపు గజాల స్థలాన్ని దేవస్థానం స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారుగా రూ.70 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
Read Entire Article