ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన నిజరూప దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజరూప దర్శనం, చందనోత్సవం నేపథ్యంలో భక్తులు భారీగా తరలిరానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అప్పన్న నిజరూప దర్శనం టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో భక్తుల కోసం నిజరూప దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచారు.