Simhachalam Dead Bodies Gold Missing: విశాఖపట్నం సింహాచలంలో చందనోత్సవం విషాదం నింపింది. గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించగా, వారి ఒంటిపైనున్న బంగారం మాయమైందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు తమ ఆభరణాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వీడియోల్లో కనిపించిన బంగారం, ఆ తర్వాత కనుమరుగు కావడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటు ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.