అక్షయ తృతీయ నాడు సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లిన కోనసీమకు చెందిన ఇద్దరు యువకులు గోడ కూలిన ఘటనలో దుర్మరణం చెందారు. విశాఖలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్న దుర్గా స్వామి నాయుడు, ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మణికంఠ ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వారి మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకులు అర్థాంతరంగా కన్ను మూయడంతో.. కన్న వారి కడుపుకోతను వర్ణించడానికి మాటలు లేవు.