విశాఖపట్నం సింహాచలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ఘటనలో సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ మృతి చెందారు. వీరికి పెళ్లై మూడేళ్లు కాగా, అప్పన్న చందనోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన వీరు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో శైలజ తల్లి, మేనత్త కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.