Simhachalam Temple Chandanotsavam Arrangements Review: సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. టికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే కొన్ని కీలక సూచనలు చేశారు.