సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద ఉన్న గోడ కూలిన ఘటనలో అప్పన్న దర్శనానికి వచ్చిన ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఘటనపై దర్యాప్తు జరిపి 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.