చందనోత్సవం సందర్భంగా సింహాచలం దేవస్థానంలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన ఏడుగురు భక్తులు గోడ కూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే నాసిరకంగా గోడను నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ గురువారం ఆలయం వద్ద విచారణ జరిపింది. ఈ సందర్భంగా గోడను నిర్మించిన కాంట్రాక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.