Controversy Over Ornaments Of Simhachalam Temple: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో వెండి, బంగారు ఆభరణాల లెక్కల్లో భారీ అవకతవకలు కలకలం రేపుతున్నాయి. పాత ఏఈవో, ప్రధానార్చకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఐదుగురు సభ్యుల కమిటీ నివేదికతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రిజిస్టర్లలో తేడాలు, 47 వస్తువులు మాయం కావడంపై విచారణ జరుగుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ చర్యలకు ఆదేశించారు. మొత్తం మీద సింహాచలం ఆలయంలో ఆభరణాల వ్యవహారం చర్చనీయాంశమైంది.